శ్యామ్‌కు పతకం ఖాయం 

Shyam is the medal winner - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వైజాగ్‌కు చెందిన శ్యామ్‌ మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఇలాహి ఇంగాతన్‌ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో మేరీకోమ్‌ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) కూడా సెమీస్‌ చేరారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top