ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సహజ | Sai Dedeepya, Sahaja enter Quarter final of AITA Tourney | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సహజ

Jun 26 2018 10:32 AM | Updated on Jun 26 2018 10:32 AM

Sai Dedeepya, Sahaja enter Quarter final of AITA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ మహిళల, పురుషుల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య, సహజ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో రెండోసీడ్‌ దేదీప్య 5–7, 6–4, 6–1తో సింధు జనగాం (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్స్‌లో కర్ణాటకకు చెందిన సొనాషి భట్నాగర్‌తో దేదీప్య తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సహజ యామలపల్లి 6–2, 2–6, 6–2తో మౌలిక రామ్‌ (తెలంగాణ)ను ఓడించింది.

పురుషుల తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్‌ కృష్ణ తేజ (తెలంగాణ) 7–5, 6–1తో హిమాన్షు మౌర్య (ఛత్తీస్‌గఢ్‌)పై గెలుపొందగా... సాయి నిఖిల్‌ (తెలంగాణ) 4–6, 4–6తో సంసిధ్‌ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కవిన్‌ మసిలమణి (తమిళనాడు) 4–6, 6–3, 6–3తో రోహిత్‌ కృష్ణ (తెలంగాణ)పై నెగ్గారు.  

ఇతర మహిళల మ్యాచ్‌ల ఫలితాలు

లక్ష్మీ సాహితి రెడ్డి (ఏపీ) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్‌ (తెలంగాణ)పై, అనూష కొండవీటి (ఏపీ) 6–3, 6–3తో దీక్ష (తెలంగాణ)పై, ముష్రత్‌ షేక్‌ (ఏపీ) 6–3, 6–2తో భక్తి షా (తెలంగాణ)పై, షాజిహా బేగం (తెలంగాణ) 6–2, 7–5తో మాల్విక శుక్లా (మహారాష్ట్ర)పై, లిఖిత (తెలంగాణ) 7–5, 6–4తో ఆకాంక్ష నిట్టూర్‌ (మహారాష్ట్ర)పై, సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 7–6 (4), 6–3తో బిపాషా (ఏపీ)పై, సి. శ్రావ్య శివాని (తెలంగాణ) 6–3, 6–1తో విదిషా రెడ్డి (తెలంగాణ)పై, ఎల్‌. లిఖిత (తెలంగాణ) 6–1, 6–1తో భవిక (మహారాష్ట్ర)పై గెలుపొందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement