నిలకడగా టీమిండియా బ్యాటింగ్ | rohit sharma and virat kohli keep india ticking | Sakshi
Sakshi News home page

నిలకడగా టీమిండియా బ్యాటింగ్

Jan 12 2016 10:13 AM | Updated on Sep 3 2017 3:33 PM

ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

పెర్త్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన 20.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి  93 పరుగులతో ఆడుతోంది.

 

రోహిత్ శర్మ(50), విరాట్ కోహ్లి(27) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు శిఖర్ ధవన్(9)తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్ లో మీడియం పేసర్ బరిందర్ స్రాన్ కు టీమిండియా తుది జట్టులోకి తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement