
భారత్ నుంచి గోల్ఫ్లో ముగ్గురు
భారత మేటి గోల్ఫర్లు అనిర్బన్ లాహిరి, ఎస్ఎస్పీ చౌరాసియాలు రియో ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
న్యూఢిల్లీ: భారత మేటి గోల్ఫర్లు అనిర్బన్ లాహిరి, ఎస్ఎస్పీ చౌరాసియాలు రియో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. వీరితో పాటు మహిళల విభాగంలో అదితి అశోక్ కూడా బరిలోకి దిగనుంది. 112 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో మళ్లీ గోల్ఫ్ను ప్రవేశపెట్టడంతో... అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య (ఐజీఎఫ్) మంగళవారం తాజా ర్యాంక్లను విడుదల చేసింది. ఇందులో ఆసియా నంబర్వన్ అనిర్బన్ (ప్రపంచ ర్యాంక్ 62), చౌరాసియా (ప్రపంచ ర్యాంకింగ్ 207)లకు వరుసగా 20, 45 ర్యాంక్లు లభించాయి. దీంతో మొత్తం 60 మంది ఎలైట్ గ్రూప్లో మెరుగైన ర్యాంక్ ప్రకారం వీరికి రియో బెర్త్లు ఖాయమయ్యాయి.