టాప్స్‌ నుంచి రెజ్లర్‌ సాక్షి ఔట్‌

Olympic Medallist Sakshi Malik Removed From TOPS

వెయిట్‌లిఫ్టర్‌ రాహుల్‌కూ ఉద్వాసన

న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌తో పాటు రాహుల్‌ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) తొలగించింది. రెజ్లర్‌ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్‌ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్‌ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్‌లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు.

క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్‌ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్‌లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్‌ షట్లర్‌ సైనా నెహా్వల్‌ తనకు వ్యక్తిగత ట్రెయినర్‌ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్‌’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ స్వరూప్‌ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్‌’ భరిస్తుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top