
ఆన్లైన్లోనూ అదుర్స్
ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి అంచె సెమీస్ను ఆన్లైన్లో రికార్డు స్థాయిలో వీక్షించారు.
న్యూఢిల్లీ: ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి అంచె సెమీస్ను ఆన్లైన్లో రికార్డు స్థాయిలో వీక్షించారు. చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను స్టార్స్పోర్ట్స్.కామ్లో రికార్డు స్థాయిలో 11 లక్షల మంది మంది తిలకించారు.
ఓవరాల్గా ఈ లీగ్ను 16 మిలియన్ల మంది ఆన్లైన్లో చూడడం జరిగింది. దీనికి అదనంగా అధికారిక ఐఎస్ఎల్ ఆన్లైన్ చానెల్లో 28 లక్షల 70 వేల మంది ఇప్పటిదాకా మ్యాచ్లను చూశారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఎంతటి ఆదరణ ఉందో తెలిసిపోతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.