భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
హరారే: భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అజింక్యా రహానె సారథ్యంలోని జట్టు హరారే చేరుకుంది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ-20ల సిరీస్లు ఆడనుంది. 10 వ తేదీ నుంచి సిరీస్ జరగనుంది. ఈ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చి రహానె నాయకత్వంలో యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.