వచ్చే నెలలో జరిగే రియో ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులందరికీ డోపింగ్ టెస్టులు నిర్వహించామని..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే రియో ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులందరికీ డోపింగ్ టెస్టులు నిర్వహించామని.. ఇందులో ఒక్కరు కూడా డోపింగ్లో పట్టుబడలేదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ స్పష్టం చేశారు.
‘రియోకు అర్హత సాధించిన భారత క్రీడాకారులంతా డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నారు. కొందరికి రెండుసార్లు, మరికొందరికి మూడుసార్లు నిర్వహించాం. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు కూడా ఈ టెస్టులు నిర్వహించాం’ అని అగర్వాల్ తెలిపారు.