ఇంగ్లండ్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ముగియగానే భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్లో
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ముగియగానే భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. జూన్ 23 నుంచి జూలై 9 వరకు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వన్డే మ్యాచ్లు జూన్ 23న, 25న, 30న, జూలై 2న, 6న జరుగుతాయి. ఏకైక టి20 మ్యాచ్ జూలై 9న జరుగుతుంది.