స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లా జట్టు సత్తాచాటుకుంది.
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లా జట్టు సత్తాచాటుకుంది. మెదక్ జిల్లా జహీరాబాద్లో జరిగిన ఈ అండర్-19 బాలుర టోర్నీలో హైదరాబాద్ రన్నరప్ సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్ పోరులో రంగారెడ్డి జట్టు 1-0తో హైదరాబాద్పై గెలుపొందింది. దీంతో రంగారెడ్డి జిల్లా జట్టు చాంపియన్గా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ 2-0తో వరంగల్ను ఓడించింది. హైదరాబాద్ జట్టుకు సయ్యద్ వికార్ అహ్మద్ కోచ్గా వ్యవహరించారు.