టీమిండియా తొలిసారి.. | first time 3 batsmen at No. 7 or lower got 50 plus scores in a Test inns for India | Sakshi
Sakshi News home page

టీమిండియా తొలిసారి..

Nov 28 2016 1:48 PM | Updated on Sep 4 2017 9:21 PM

టీమిండియా తొలిసారి..

టీమిండియా తొలిసారి..

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

మొహాలి:ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 417 పరుగుల వద్ద ఆలౌటై మ్యాచ్ పై పట్టు సాధించింది. కాగా, ఇదే క్రమంలో ఒక మైలురాయిని కూడా భారత క్రికెట్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు, అంతకంటే కిందవచ్చిన ఆటగాళ్లు మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఘనతను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది.

 

ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవి చంద్రన్ అశ్విన్(72;113 బంతుల్లో  11 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం సాధించాడు. మరొకవైపు తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్  (55;141 బంతుల్లో 4 ఫోర్లు) తొమ్మిదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున ఒక టెస్టులో ఇలా ముగ్గురు కిందస్థాయి ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement