అభినందనల పర్వం | all wishes to pv sindhu | Sakshi
Sakshi News home page

అభినందనల పర్వం

Aug 20 2016 1:35 AM | Updated on Sep 4 2017 9:58 AM

అభినందనల పర్వం

అభినందనల పర్వం

ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.

ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.
‘ధృడ సంకల్పంతో అద్భుతంగా ఆడావు. దేశం తరఫున రజతం సాధించినందుకు అభినందనలు’       - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
‘ఫైనల్లో మంచి పోరాటాన్ని ప్రదర్శించావు. రియోలో నీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం. కొన్నేళ్లు గుర్తుండిపోతుంది’      - ప్రధాని మోదీ
‘పీవీ సింధు పోరాటం అద్భుతం. ఈ కృషికి కారణమైన కోచ్ గోపీచంద్‌కు కూడా అభినందనలు’ - తెలంగాణ సీఎం కేసీఆర్
‘ఈ గెలుపు చరిత్రాత్మకం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని విజయాలకు నాంది పలికే స్ఫూర్తిమంతమైన విజయం’ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
‘సింధు పోరాట పటిమ నూరు కోట్ల భారతీయులకు స్ఫూర్తి నిచ్చింది. స్వర్ణం కోసం తుది వరకూ పోరాడిన సింధు యువతరానికి గర్వకారణం’ - ఏపీ సీఎం చంద్రబాబు
‘చిన్న వయస్సులోనే ఒలింపిక్ పతకం సాధించినందుకు అభినందనలు.అద్భుతంగా ఆడి మా హృదయాలను కొల్లగొట్టావు’       - సచిన్ టెండూల్కర్
‘వారం రోజుల క్రితం కంటే ఇప్పుడే ఎక్కువగా ‘బాధపడుతున్నాను’. పీవీ సింధు నాకు స్ఫూర్తిగా నిలిచావు’   - అభినవ్ బింద్రా
‘విజేతకు ఫైనలిస్ట్‌కు తేడా స్వల్పం మాత్రమే. నీ ప్రదర్శనతో గర్విస్తున్నాం. రజతాన్ని ఆస్వాదించు’    - విశ్వనాథన్ ఆనంద్
సింధు సాధించిన విజయం దేశంలోని లక్షలాది చిన్నారులకు ఈ ఆట పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ప్రపంచ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ ప్రతిభను చూపగలిగింది’       - బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా


కనకవర్షం: సింధు రజతం సాధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement