25న వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం ఎల్లుండి(శనివారం) జరగనుంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించే దిశగా దూసుకుపోతోంది. 150 పైగా స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించనుంది.
కాగా, విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి వైఎస్ జగన్ ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల వివరాలను స్వామికి తెలిపారు.