ప్రధాని, రాష్ట్రపతిని అందించిన నంద్యాల | Sakshi
Sakshi News home page

ప్రధాని, రాష్ట్రపతిని అందించిన నంద్యాల

Published Fri, Mar 29 2019 10:25 AM

Two Aggressive Leaders Became President And Prime Minister Nandyal Parliament Constituency - Sakshi

సాక్షి, కర్నూలు :  కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ సెగ్మెంట్‌ దక్కించుకుంది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి,  ప్రధాని పీవీ నరసింహరావు నంద్యాల నుంచి విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా జనతా పార్టీ తరఫున ‘నీలం’ ఒక్కరే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక 1991లో ప్రధానిగా పీవీ నరసింహరావు ఎన్నికవడంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పీవీ కోసం రాజీనామా చేశారు. ఇక్కడినుంచి పీవీ రెండుసార్లు విజయం సాధించారు.  

Advertisement
Advertisement