టికెట్‌ లేదనడంతో టీడీపీ నేత కన్నీటి పర్యంతం..! | TDP Leader Veerbhadra Goud Disappointed Denying MLA Ticket | Sakshi
Sakshi News home page

టికెట్‌ లేదనడంతో టీడీపీ నేత కన్నీటి పర్యంతం..!

Mar 16 2019 6:48 PM | Updated on Mar 16 2019 7:34 PM

TDP Leader Veerbhadra Goud Disappointed Denying MLA Ticket - Sakshi

కెట్‌ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

సాక్షి, కర్నూలు : టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడొకరు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వీరభద్రగౌడ్‌ బీసీ నాయకులను చంద్రబాబు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆలూరు టికెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఉన్నపళంగా తనకు టికెట్‌ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాబు ఇంత మోసం చేస్తాడనుకోలేదని వాపోయారు.కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో అత్యంత కీలకైన బీసీ నాయకులను చంద్రబాబు కంటతడి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న బీసీల కష్టాన్ని లెక్కచేయకుండా వలస నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీసీలే నా దేవుళ్లు అని చెప్పుకునే చంద్రబాబు బీసీల రాజకీయ భవితవ్యానికి సమాధి కడుతున్నారని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement