మాట తప్పిన సీఎం 

Ponnam Prabhakar fires on Minister CM KCR - Sakshi

రాజన్న ఆలయాభివృద్ధికి ఏటా వంద కోట్లు ఏవీ?: పొన్నం 

సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. శనివారం ఉదయం రాజన్న సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్‌ నేతలు.. సిరిసిల్ల వరకు 12 కిలోమీటర్లు నడిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

పొన్నం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ శివుడికే శఠగోపం పెట్టారని ఆరోపించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ)ను వేములవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాకు వినతిపత్రం అందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top