కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు | no one can trust kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు

Mar 26 2018 10:11 AM | Updated on Aug 15 2018 9:04 PM

no one can trust kcr - Sakshi

మాట్లాడుతున్న నారాయణ

అల్గునూర్‌(మానకొండూర్‌): సీఎం కేసీఆర్‌ను దేశంలో ఏ పార్టీ నాయకులు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేశ్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలో ఆదివారం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ రాజకీయ వ్యభిచారి అని.. ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్‌ఎస్‌ వైఖరేంటో తెలుపాలన్నారు. మైనార్టీల రిజర్వేషన్ల పెంపుకోసం పోరాడుతున్నట్లు నటిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి సీపీఐ, సీపీఎం, ఆర్‌జేడీ, బీఎస్పీ, సమాజ్‌వాదీపార్టీ, కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం బీజేపీతో కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించారు. మైనార్టీలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కేవలం మభ్యపెట్టేందుకే ఆందోళన చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ నగేశ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement