భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి | Sakshi
Sakshi News home page

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి

Published Sat, Mar 16 2019 12:24 PM

Komatireddy Venkat Reddy Contest From Bhuvanagiri Parliament - Sakshi

సాక్షి, నల్గొండ : భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైంది. తొలుత భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కి భావించినా ..కోమటిరెడ్డి పోటీ చేయాలనుకోవడంతో వెనక్కి తగ్గారు. మధుయాష్కి వెనక్కి తగ్గడం, కోమటిరెడ్డి బలమైన నేత కావడంతో అధిష్టానం కోమటిరెడ్డి వైపే మొగ్గుచూపింది.  రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉంది.

2018 తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన కోమటిరెడ్డి పరాజయం పాలైన విషయం తెలిసిందే. గతంలో తన ఓటమిపై ఆయన స్పందిస్తూ.. తనలాంటి నాయకులు ఓడిపోవడానికి పొత్తులే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌ బరిలో నిలిచి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement