తిరుపతి(చిత్తూరు జిల్లా): దేశాన్ని రక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు.. కానీ దాని అర్ధం తెలుగు దేశాన్ని రక్షిస్తానని చెప్పడమే.. ప్రజలు ఈ విషయం గమనించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. తిరుపతిలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న హడావిడి అంతా కాపాడటానికి కాదని దేశాన్ని కూల్చడానికేనని తీవ్రంగా విమర్శించారు. తానూ చిత్తూరు జిల్లా వాడినేనని, మా అమ్మ గారి సొంతూరు మదనపల్లి అని చెప్పారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలం చెందారని ఆరోపించారు. తన సొంత జిల్లాలో అభివృద్ధి చేయలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు బాబు బినామీలకు అప్పగింత
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు తన బినామీలకు అప్పజెప్పారని జీవీఎల్ ఆరోపించారు. రాయలసీమలో ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. నిన్న ఢిల్లీలో యూటర్న్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన రాజకీయాల వల్ల దేశంలో ఎటువంటి మార్పు రాదని గ్రహించాలని హితవుపలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి అవినీతి కూటమి, అప్రజాస్వామిక కూటమి, ఈ కూటమిలో చేరిన పార్టీలు భూస్థాపితం అవుతాయని జోస్యం చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఏ కూటములు ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు.
2019 తర్వాత టీడీపీ కనుమరుగు
2019 ఎన్నికలు టీడీపీకి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని, ఆ తర్వాత టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీతో కలిసిన పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయని శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్తో పొత్తు, విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదని, కేవలం అవగాహనా రాహిత్యంగా బీజేపీపై బురదజల్లే దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దోలెరా నగరం ఏవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా చిత్తూరులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ త్వరలో రాబోతుందని తెలిపారు. చెన్నై-కోల్కత్తా ఇండస్ట్రీ కారిడార్ రావడం వల్ల ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీ రాబోతున్నాయని తెలిపారు.
Published Fri, Nov 2 2018 1:28 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement