ఓటు వేసేందుకు అమెరికా నుంచి వచ్చాను | NRI Come From America For Vote Right | Sakshi
Sakshi News home page

ఓటు వేసేందుకు అమెరికా నుంచి వచ్చాను

Dec 8 2018 8:57 AM | Updated on Jul 6 2019 12:42 PM

NRI Come From America For Vote Right - Sakshi

రాజేంద్రనగర్‌: అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న కార్తీక్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరానికి వచ్చారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ హైదర్షాకోట్‌ పొలింగ్‌ బూత్‌ 56లో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు నారాయణరావు, జ్యోతితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక్‌ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చానన్నారు. ఆదివారం రాత్రి తిరిగి అమెరికాకు పయనమవుతున్నట్లు వెల్లడించారు. ఓటు ఎంతో పవిత్రమైందన్నారు. ప్రపంచంలోనే భారత దేశ ప్రజాస్వామ్యం ఎంతో గోప్పదన్నారు. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement