కాలిఫోర్నియా : నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో నాట్స్ మహిళా సంబరాల్లో భాగంగా 5కే వాకథాన్ నిర్వహించారు. నూతన లాస్ ఏంజిల్స్ చాప్టర్ కార్యవర్గం పర్యవేక్షణలో దక్షిణ కాలిఫోర్నియాలోని సెర్రిటాస్, ఓక్ పార్క్లలో 5కే వాకథాన్ నిర్వహించారు. సెర్రిటాస్ రీజినల్ పార్క్లో నిర్వహించిన వాకథాన్ను సినీ నటి లయ ప్రారంభించారు. స్వయం వరం సినిమాలో హీరోయిన్గా నటించి లయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో బ్రహ్మలోకం టూ యమలోకం సినిమాలో పరాశక్తి పాత్రలో కనిపించిన లయ ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. నటనకు స్వస్తి పలికిన లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడిన విషయం తెలిసిందే.
ఫ్లోరిడాలో జరిగిన విధ్వంసకాండలో బలైన పిల్లలని గుర్తుచేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ, పిల్లల జీవితంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని లయ అన్నారు. వారితో స్నేహితులుగా మెలగాలి అని సూచించారు. అందరూ పిల్లల భవిష్యత్తు కోసం పాటు పడాలని కోరారు. 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా శ్రేయస్సు కోసం నాట్స్ చేస్తున్న ప్రయత్నాన్ని మరింతగా బలపరచాలని నాట్స్ మహిళా కార్యకర్తలు శిరీష పొట్లూరి, నీలిమ యాదల్లా, అనితా కొంక, అనితా కాట్రగడ్డ అన్నారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన కార్యకర్తలను నాట్స్ లాస్ ఏంజిల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు, కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురు కొంక ధన్యవాదములు తెలిపారు. మార్చి 10న జరిగే మహిళా సంబరాలను వినూత్నంగా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు పౌరులకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ కాలిఫోర్నియాలో నివాసముంటున్న తెలుగు వారందరిని ఆహ్వానించారు. పూనమ్ మాలకొండయ్య, శ్రావ్య కళ్యాణపు, లయ గొర్తి, షెరిల్ స్పిల్లెర్ లు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలియచేశారు.
5కే వాకథాన్లో మెరిసిన నటి లయ
Published Tue, Feb 27 2018 11:36 AM
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement