ప్రపంచ యోగా దినోత్సవం-2016 సందర్భంగా యోగ్ గీత్ పేరుతో పాటను ఆయుష్ మినిష్టర్ శ్రీపాద్ నాయక్ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు
ప్రపంచ యోగా దినోత్సవం-2016 సందర్భంగా యోగ్ గీత్ పేరుతో పాటను ఆయుష్ మినిష్టర్ శ్రీపాద్ నాయక్ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. మూడు నిమిషాల పదిహేను సెకండ్ల నిడివి కలిగిన ఈ గీతం హిందీ భాషలో ఉంది. ధీరజ్ సారస్వత్, గంగాధర్, టీ.డీ జాదవ్, గత జాదవ్ లు ఈ పాటను రాసి ఆలపించారు. సుమంత్ రే పాటకు సంగీతాన్ని సమకూర్చారు. యోగ్ గీత్ పాట కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ వచ్చిన 19 గీతాల నుంచి దీనిని ఎంపిక చేసింది. గత ఏడాది నుంచి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.