ayush minister
-
యోగా కోసం పాట!
ప్రపంచ యోగా దినోత్సవం-2016 సందర్భంగా యోగ్ గీత్ పేరుతో పాటను ఆయుష్ మినిష్టర్ శ్రీపాద్ నాయక్ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. మూడు నిమిషాల పదిహేను సెకండ్ల నిడివి కలిగిన ఈ గీతం హిందీ భాషలో ఉంది. ధీరజ్ సారస్వత్, గంగాధర్, టీ.డీ జాదవ్, గత జాదవ్ లు ఈ పాటను రాసి ఆలపించారు. సుమంత్ రే పాటకు సంగీతాన్ని సమకూర్చారు. యోగ్ గీత్ పాట కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ వచ్చిన 19 గీతాల నుంచి దీనిని ఎంపిక చేసింది. గత ఏడాది నుంచి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. -
చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చాపల కొనుగోలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? అక్షరాలా 92 లక్షల రూపాయలు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు గురువారం తెలిపింది. ఆయుష్ మంత్రిత్వశాఖ మొత్తం 37 వేల యోగా చాపలను కొనుగోలు చేసింది. మెసర్స్ ఆర్క్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని సరఫరా చేసింది. ఈ మొత్తం చాపలకు రూ. 92.50 లక్షలు (పన్నులు అదనం) ఖర్చయినట్లు ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మొత్తం కార్యక్రమ నిర్వహణకు దాదాపు రూ. 32 కోట్లు ఖర్చయినట్లు ఇంతకుముందు ప్రభుత్వం తెలిపింది.