లక్నో: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్నవిషయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేది సంక్రాంతికా.. లేక శ్రీరామనవమికా అనే విషయంలో స్పష్టత లేకపోయినా అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులతో కోలాహలంగా ఉంది. ఇన్నాళ్లూ ఆలయ నిర్మాణంపై స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇస్తోందంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో వాతావరణమంతా ప్రశాంతగా మారింది. పవిత్ర సరయూ నది తీరంలో ఉన్న రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య పట్టణానికి భక్తులు భారీగా పొటెత్తున్నారు. ఆలయ నిర్మాణానికి కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పడుతుందని శిల్పులు చెబుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
కోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
Published Fri, Nov 15 2019 2:11 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
Advertisement