సరి-బేసి విధానంపై ప్రభుత్వానికి చురకలు | Women, 2-wheelers not exempt: NGT turns down Delhi govt plea on odd-even | Sakshi
Sakshi News home page

సరి-బేసి విధానంపై ప్రభుత్వానికి చురకలు

Nov 14 2017 3:53 PM | Updated on Nov 14 2017 5:03 PM

Women, 2-wheelers not exempt: NGT turns down Delhi govt plea on odd-even - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం, పొగమంచు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు  ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంతో ముందుకొచ్చింది. కానీ దీన్ని అమలు చేయడంలోనే జాప్యం జరుగుతోంది. ఈ విధానం నుంచి మహిళలను, టూ-వీలర్స్‌ను మినహాయించాలని ప్రభుత్వం కోరుతుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అందరికీ ఈ పాలసీని అమలు చేయాల్సిందేనని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ తీర్పునిచ్చింది. ఈ విషయంపై మరోసారి ఎన్‌జీటీని ప్రభుత్వం ఆశ్రయించగా.. మరోసారి కూడా ఢిల్లీ ప్రభుత్వ అభ్యర్థనను ఈ ట్రైబ్యూనల్‌ కొట్టివేసింది. మహిళలను, టూ-వీలర్స్‌ను కూడా ఈ విధానం నుంచి మినహాయించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. 

కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీచేసింది. సరి-బేసి విధాన రోజుల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యను పరిష్కరించడానికి కేవలం మహిళ కోసం బస్సులు ఎందుకు నడపడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫోర్‌-వీలర్స్‌ కంటే టూ-వీలర్సే ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు టూ-వీలర్స్‌కు మినహాయింపు కోరుతుందో తెలియడం లేదంది. ఇదేమనా జోకా? అంటూ మండిపడింది. ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం తన పిటిషన్‌లో మార్పుల కోసం తన ఫిర్యాటును విత్‌డ్రా చేసుకున్నట్టు తెలిసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement