ఆర్మీ జీప్‌పై కట్టేశారు! | why a man was tied to an Indian Army jeep in Kashmir | Sakshi
Sakshi News home page

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

Apr 15 2017 1:36 AM | Updated on Sep 5 2017 8:46 AM

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం పోలింగ్‌ జరగ్గా, ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం తెలిసిందే.

ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిబ్బంది...ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు, ఫరూక్‌దార్‌ అనే వ్యక్తిని రక్షణ కవచంలా తమ జీప్‌నకు ముందువైపు కట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు ఫరూక్‌ మాట్లాడుతూ తాను ఓటు వేసి తన సోదరి ఇంటికి వెళ్తుండగా ఆర్మీ సిబ్బంది తనను పట్టుకుని జీప్‌పై కట్టేసి 10 నుంచి 12 గ్రామాలకు తిప్పారని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement