
సివిల్స్ -2016 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్- 2016 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్- 2016 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీస్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది. అన్మోల్ షేర్ సింగ్ బేడీ రెండో స్థానంలో, రోనాన్కీ మూడవ స్థానంలో నిలిచారు. మొత్తం 1099 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
టాప్ - 10 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేంద్ర సర్వీసులు, గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులకు వీరు ఎంపికయ్యారు.500 మంది జనరల్ కేటగిరీలో ఎంపిక కాగా, 347 మంది ఓబీసీ, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ విభాగాలలో ఎంపిక అయ్యారు.
4వ ర్యాంకు- సౌమ్య పాండే
5వ ర్యాంకు- అభిలాశ్ మిశ్రా
6వ ర్యాంకు- దినేష్కుమార్
7వ ర్యాంకు- ఆనంద్ వర్ధన్
8వ ర్యాంకు- శ్వేతా
9వ ర్యాంకు- సుమన్ సౌరవ్ మహంతి
10వ ర్యాంకు- బీఎంయు భట్
36వ ర్యాంకు- మణి చౌదరి
80వ ర్యాంకు- అన్వేష్ రెడ్డి
152వ ర్యాంకు - సురుచి చౌదరి
166వ ర్యాంకు - కర్నాటి వరుణ్ రెడ్డి
167వ ర్యాంకు - బాలలత
353వ ర్యాంకు - పవన్ కుమార్ రెడ్డి
502వ ర్యాంకు - అవినాష్
519వ ర్యాంకు - శ్రీకాంత్ రెడ్డి
531వ ర్యాంకు - యశ్వంత్ రావు
862వ ర్యాంకు - సునీతా చౌదరి