సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకం | supreme court gets five more judges approved by president | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకం

Feb 15 2017 7:44 PM | Updated on Sep 2 2018 5:28 PM

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకం - Sakshi

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకం

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జస్టిస్‌ నవీన్ సిన్హా, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దీపక్ గుప్తా, జస్టిస్‌ మోహన్‌ శాంతన గౌండర్‌, జడ్జి ఎస్‌ అబ్దుల్ నజీర్‌ను జడ్జీలుగా నియమించారు.

ఐదుగురు కొత్త జడ్జీల నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి చేరింది. వీరిలో నలుగురు పలు రాష్ట్రాల హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు కాగా, ఒకరు కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఐదుగురు జడ్జీలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ముగ్గురు జడ్జీలు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement