తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ | Stage collapses ahead of Varun Gandhi's speech in UP | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ

Mar 13 2016 7:40 PM | Updated on Mar 29 2019 8:33 PM

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ - Sakshi

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మొరదాబాద్ (ఉత్తరప్రదేశ్) : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రైతులతో సమావేశమవడానికి వెళుతున్న వరుణ్.. మార్గమధ్యంలో మొరదాబాద్-హరిద్వార్ జాతీయ రహదారిలో తన కోసం వేచి ఉన్న మద్దతుదార్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో వరుణ్ ఉన్న వేదిక కూలిపోయింది.

వేదికపై వరుణ్ తో పాటు స్థానిక ఎంపీ సర్వేశ్ కుమార్, మొరదాబాద్ మేయర్ వీనా అగర్వాల్ ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మొరదాబాద్ ఏఎస్పీ యస్విర్ సిన్హా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement