ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారువా వివాదంలో చిక్కుకున్నారు.
ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు, వివాదంలో సంజయ్ బారు
Apr 11 2014 9:21 PM | Updated on Sep 2 2017 5:54 AM
న్యూఢిల్లీ: ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారువా వివాదంలో చిక్కుకున్నారు. పుస్తక రచనలో వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం తన పదవిని దుర్వినియోగం చేశారని ప్రధాని మంత్రిత్వశాఖ ఆరోపించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా చేసిందని బారువా పుస్తకంలో పేర్కొనడం వివాదస్పదమైంది. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ మన్మోహన్ సింగ్' అనే పుస్తకంలోని కొంత భాగం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. వ్యక్తిగత స్వార్ధం కోసం తన హోదాను వాడుకోవడంపై ప్రధాని కార్యాలయం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
Advertisement


