దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు | No worry about cereal production seeds | Sakshi
Sakshi News home page

దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు

Mar 23 2015 12:59 AM | Updated on Oct 1 2018 2:36 PM

దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు - Sakshi

దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు

దేశీయంగా తృణధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా ఉందని, దేశీయ అవసరాల కోసం వంట నూనె, కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది.

న్యూఢిల్లీ: దేశీయంగా తృణధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా ఉందని, దేశీయ అవసరాల కోసం వంట నూనె, కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. దేశంలో పెరిగిన రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇస్తూ అఫిడవిట్‌లో వ్యవసాయ శాఖ ఈ వివరాలు తెలిపింది.

భారత్‌లో దేశీయ అవసరాలకేకాక ఎగుమతి చేసేంత స్థాయిలో గోధుమ, బియ్యం నిల్వలున్నాయని,  ఆహార భద్రత పథకం ద్వారా వంట నూనెలు, కాయధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపింది.  48 శాతం పంటభూమిలో ఆహారధాన్యాలనే పండిస్తున్నారనే అభిప్రాయాలను కేంద్రం తోసిపుచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement