న్యూఢిల్లీః అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ మే 30న మరోసారి భారత్ లో పర్యటించనున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకొంటారు. అలాగే సీఐఐ నిర్వహించనున్నమరోకార్యక్రమంలో పాల్గొని భారత్ లోని 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో కూడ సమావేశమౌతారు.
భారత్ ను సందర్శించనున్న నాదెళ్ళ ఈసారి పర్యటనలో భాగంగా సాంకేతిక సంస్కృతి అభివృద్ధి, భారత్ లో పరివర్తన, ప్రపంచంలో వాస్త సమస్యల పరిష్కారం వంటి అనేక సాంకేతిక విషయాలపై నిపుణులతో చర్చిస్తారు. ఏడు నెలల వ్యవధిలో నాదెళ్ళ భారత్ కు రావడం ఇది మూడోసారి కాగా గత డిసెంబర్ లో ఇండియా సందర్శించిన సందర్భంలో ఆయన...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలసి, అనంతరం హైదరాబాద్ లోని స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ను, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు.
నవంబర్ పర్యటనలో భాగంగా ముంబైలోని మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీషెడ్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నాదెళ్ళ.. అనంతరం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ వంటి వ్యాపారవేత్తలను, పరిశ్రమల అధినేతలను కలుసుకున్నారు. భారత్ లో ఇటీవల పెరుగుతున్న ప్రపంచ నేతల సందర్శనలు, ఒప్పందాలను చూస్తే దేశం ఒక్క ఔట్ సోర్సింగ్ కేంద్రగానే కాక, సాంకేతికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న విషయం అర్థమౌతుంది.
మరోసారి భారత్ కు సత్య నాదెళ్ళ!
Published Sat, May 21 2016 9:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement