2న ప్రధాని, సోనియాల ఏరియల్ సర్వే | Manmohan singh, Sonia Gandhi to make aerial survey of flood-ravaged Srikakulam District | Sakshi
Sakshi News home page

2న ప్రధాని, సోనియాల ఏరియల్ సర్వే

Oct 30 2013 11:03 PM | Updated on Oct 22 2018 9:16 PM

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు నవంబర్ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు నవంబర్ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పై లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను వారు పరిశీలిస్తారు. వీరు గురువారం ఈ ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రెండో తేదీకి వాయిదా పడింది. 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి  హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాత ఒడిశాలోని గంజాం జిల్లాలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలో కూడా నష్టాన్ని పరిశీలిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement