రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ | lk advani express displeassure over parliament sessions | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ

Dec 15 2016 1:22 PM | Updated on Sep 4 2017 10:48 PM

రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ

రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. 
 
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని ఆయన చెప్పారు. ఒకవైపు ప్రతిపక్షం, వాళ్లకు దీటుగా అధికార పక్షం కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడగా రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి, చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏ ఒక్క అంశంపై కూడా చర్చలు జరగడం లేదు. దాంతో ఈ తీరుపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement