జయలలితదే తుది నిర్ణయం | Jayalalithaa has to decide on her discharge | Sakshi
Sakshi News home page

జయలలితదే తుది నిర్ణయం

Nov 18 2016 3:00 PM | Updated on Sep 4 2017 8:27 PM

జయలలితదే తుది నిర్ణయం

జయలలితదే తుది నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఊపిరితిత్తుల్లోకి ఇన్‌ఫెక్షన్‌ సోకకూడదని జయలలితను ఇంకా ఐసీయూలోనే ఉంచామని చెప్పారు. డిశ్చార్జ్‌ ఎప్పుడనేది జయలలితే నిర్ణయించుకుంటారని ప్రతాప్‌ సి.రెడ్డి పేర్కొన్నారు. అయితే డిశ్చార్జ్‌ తేదీ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. 
 
జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్‌ 22న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తమ అధినేత్రి పూర్తి స్థాయిలో కోలుకోవడంతో అన్నాడీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత తనంతట తాను శ్వాస తీసుకుంటున్నారని... ఆమెకు ఇది పునర్జన్మ అని చెబుతున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement