'ఆమె వ్యాఖ్యలను పెద్దమనసుతో క్షమించండి' | House should forgive Sadhvi Niranjan Jyoti, urges narendra modi in Lok Sabha | Sakshi
Sakshi News home page

'ఆమె వ్యాఖ్యలను పెద్దమనసుతో క్షమించండి'

Dec 5 2014 1:30 PM | Updated on Aug 15 2018 2:20 PM

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి మంత్రిగా కొత్తవారని... ఆమె వ్యాఖ్యలను పెద్ద మనసుతో క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ...

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి మంత్రిగా కొత్తవారని... ఆమె వ్యాఖ్యలను పెద్ద మనసుతో క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లోక్‌సభ సభ్యులను కోరారు. నిన్న రాజ్యసభలో సాధ్వి నిరంజన్‌ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ప్రధాని మోదీ ఇవాళ లోక్‌సభ సభ్యులకు కూడా వివరణ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగనీయకపోవడం వల్ల చర్చించాల్సిన అనేక అంశాలు పెండింగ్‌లో పడుతున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనసుతో సభ్యులందరూ అర్థం చేసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement