పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి | Grenade attack on police post in Kulgam | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి

Oct 26 2017 5:59 PM | Updated on Oct 26 2017 6:02 PM

Grenade attack on police post in Kulgam

శ్రీనగర్‌: పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి జరిగిన ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దమ్హాల్‌ హాంజిపుర పోలీస్‌ స్టేషన్‌పై గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు.

ఏం జరిగిందో గుర్తించే లోపే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌, ఓ కానిస్టేబుల్‌లతో పాటు తన పని నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పౌరుడు తీవ్రంగా గాయాపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement