గత 2004, 2009 ఎన్నికల్లో మాదిరిగానే ఎన్డీఏ గ్యాస్ బెలూన్ మరోసారి పేలిపోతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.
ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలుతుంది
ఔరంగాబాద్/గొడ్డా: గత 2004, 2009 ఎన్నికల్లో మాదిరిగానే ఎన్డీఏ గ్యాస్ బెలూన్ మరోసారి పేలిపోతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. బీహార్లోని ఔరంగాబాద్లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. 2004లో ‘భారత్ వెలుగుతోంది’ అంటూ వారు ఊదరగొట్టినా వారి గ్యాస్ బెలూన్ పగిలిపోయిందని, 2009లోనూ అదే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారు అదే గ్యాస్ బెలూన్ను ప్రదర్శిస్తున్నారని, అది కూడా పేలిపోతుందన్నారు.
మూడింట ఒకవంతు నల్లధనమే!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖర్చవుతుందని భావిస్తున్న మొత్తం రూ.30 వేల కోట్లలో సుమారు మూడింట ఒకవంతు వరకు నల్లధనమేనని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. నల్లధనంతో కలిపి ఈ ఎన్నికల్లో పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ ఇంత పెద్దమొత్తంలో వ్యయం చేయడం ఇదే మొదటిసారి. రూ.30 వేల కోట్లు ఇంతవరకు దేశంలో జరిగిన ఏ ఎన్నిక సందర్భంగానూ ఖర్చు కాలేదు. 2014 లోక్సభ ఎన్నికలకు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు రూ.8,000 కోట్లు-రూ.10,000 కోట్ల మధ్య ఖర్చుపెడతాయని అంచనా కాగా, ఆయూ పార్టీల అభ్యర్థులు వ్యక్తిగత స్థారుులో 10వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉందని సీఎంఎస్ అనే పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఈసీ సహా ప్రభుత్వ సంస్థలు రూ.7,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ఆ అధ్యయనం తెలిపింది.
వికలాంగ ఓటర్లకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: వికలాంగులైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఢిల్లీ ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు.. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రానున్నారుు. ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం మేరకు ఈ ‘ఢిల్లీ మోడల్’ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ దృష్టిని ఆకర్షించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ తరహా ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విధానంలో.. వికలాంగ ఓటర్లు పోలింగ్ రోజున తమకు కావలసిన ఏర్పాట్లను ఆయూ రాష్ట్రాల ఎన్నికల సంఘాల వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వీరికోసం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓ చక్రాల కుర్చీ అందుబాటులో ఉంచు తారు. ర్యాంపులు, రెరుులింగ్ల వంటి సౌకర్యాలుంటారుు. ‘మే ఐ హెల్ప్ యూ’ అనే ట్యాగ్ వేసుకున్న వలంటీర్లు వారికి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారు.
రైతు కోసం అన్నా ‘స్వాతంత్య్ర సంగ్రామం’
భువనేశ్వర్, న్యూస్లైన్: దేశానికి అన్నం పెట్టే రైతన్నలను పార్లమెంట్కు పంపాలనే లక్ష్యంతో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ‘రెండో స్వాతంత్య్ర సంగ్రామం’ ప్రారంభించారు. పార్టీ ఆధారిత రాజకీయాలతో విసిగిపోయానని చెప్పిన ఆయన.. 2024 నాటికి 100 నుంచి 125 మంది రైతన్నలను పార్లమెంట్లో చూడాలని కోరుకుంటున్నానన్నారు. నవనిర్మాణ్ కృషక్ సమాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్లమెంట్, అసెంబ్లీల్లో పార్టీలు పెత్తనం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకోవలసిన స్థానంలో పార్టీలకు గుర్తింపు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల కమిషన్ దారి తప్పిస్తోంది’’ అని అన్నా అన్నారు. రాజ్యాంగంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉంది తప్ప పార్టీల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. అందుకే ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మార్పు తీసుకురావాలని, దానికి యువత సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.