అండమాన్‌ నికోబార్‌లో భూకంపం | Earthquake Hits Nicobar Islands | Sakshi
Sakshi News home page

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

Aug 21 2019 4:47 PM | Updated on Aug 21 2019 4:52 PM

Earthquake Hits Nicobar Islands - Sakshi

పోర్ట్‌ బ్లేయర్‌: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్‌ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్‌ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్‌ కచ్‌ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement