‘మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పాల్‌ | Dr Paul conferred with ‘Media Person of the Year’ Award | Sakshi
Sakshi News home page

‘మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పాల్‌

Jan 24 2019 5:17 AM | Updated on Jan 24 2019 5:17 AM

Dr Paul conferred with ‘Media Person of the Year’ Award - Sakshi

న్యూఢిల్లీ: మీడియా రంగానికి చెందిన డాక్టర్‌ హెచ్‌.ఎస్‌.పాల్‌ను ఏసీఎస్‌ మీడియా కార్పొరేషన్‌ తాజాగా ‘మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2018’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్‌ మీడియా ఇంపాక్ట్‌ అవార్డ్స్‌’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌(ప్రొఫెసర్‌) పీకే పాటసాని, ఏసీఎస్‌ మీడియా కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌(ప్రొఫెసర్‌) అభిరామ్‌ కులశ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్‌ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ఇంగ్లీష్‌ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్‌’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement