ఆటోలో కోర్టు విజిట్‌?! | Delhi High Court Judges Travel in Autos | Sakshi
Sakshi News home page

ఆటోలో కోర్టు విజిట్‌?!

Sep 1 2017 12:47 PM | Updated on Sep 17 2017 6:15 PM

ఆటోలో కోర్టు విజిట్‌?!

ఆటోలో కోర్టు విజిట్‌?!

ఆరు ఆటో రిక్షాలు హఠాత్తుగా వచ్చి ఢిల్లీ హైకోర్టు ముందు ఆగాయి.

► ఆటోలో ప్రయాణించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌
► కోర్టు పరిసరాలను ఆకస్మిక తనిఖీ చేసిన వైనం


న్యూఢిల్లీ: ఆరు ఆటో రిక్షాలు హఠాత్తుగా వచ్చి ఢిల్లీ హైకోర్టు ముందు ఆగాయి. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటోలో ఉన్న వ్యక్తులు యధాలాపంగా బయటకు వచ్చి.. హైకోర్టు పరిసరాలను, న్యాయవాదులను పరిశీలించడం మొదలు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత కానీ ఆటోలో  వచ్చింది ఎవరో అక్కడివారికి అర్థం కాలేదు.

అర్థం అయ్యాక ఆటోల ముందు న్యాయవాదులు, అధికారులు పరుగులు పరుగులు తీశారు. ఆటోలో వచ్చింది.. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, ఇతర న్యాయమూర్తులు రవీంద్ర భట్‌​, మురళీధర్‌, సంజీవ్‌ ఖన్నా తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆకస్మింగా తనఖీ చేసేందుకు  సామాన్యుల్లా ఆటోల్లో వచ్చారు.

ఢిల్లీ హైకోర్టులోని అధికారులు, న్యాయమూర్తుల పనితీరు, క్రమశిక్షణను పరిశీలించేందుకే ఇలా వచ్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా గీతా మిట్టల్‌ చెప్పారు. కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులను సైతం వారు పరిశీలించారు. పరిపాలనాపరంగా కొన్ని లోపాలను గుర్తించామని గీతా మిట్టల్‌ చెప్పారు. వాటిని దిద్దుకునేందుకు తగిన సూచనలు, సలహాలు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement