పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ | Corrupt are buying sleeping pills, says PM narendra modi in Ghazipur | Sakshi
Sakshi News home page

‘వాళ్లే నిద్రమాత్రలు వేసుకుంటున్నారు’

Nov 14 2016 1:08 PM | Updated on Mar 29 2019 5:57 PM

పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ - Sakshi

పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ

దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఘజీపూర్: దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం  ఉత్తరప్రదేశ్ ఘజీపూర్లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు సహకరిస్తుంటే... నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు.  పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement