ఉగ్రవాదుల కాల్పులు: పోలీసు మృతి | cop injured in firing by militants in Anantnag town | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కాల్పులు: పోలీసు మృతి

Jul 3 2017 1:26 PM | Updated on Sep 5 2017 3:06 PM

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
 
వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో జరగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement