తమిళనాట మావోయిస్టుల వేట | Combing intensified in tamilnadu forests to nab maoists | Sakshi
Sakshi News home page

తమిళనాట మావోయిస్టుల వేట

Apr 26 2014 4:47 PM | Updated on Oct 9 2018 2:51 PM

తమిళనాడులోని ఊటీ అడవుల్లో మావోయిస్టుల కోసం వేట ముమ్మరమైంది.

తమిళనాడులోని ఊటీ అడవుల్లో మావోయిస్టుల కోసం వేట ముమ్మరమైంది. గిరిజన ప్రాంతాల్లో తమ కార్యకలాపాలకు అధికారులు అడ్డం పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఇటీవలే నలుగురు సాయుధుల బృందం ఒకటి ఓ కానిస్టేబుల్ను బెదిరించింది. దీంతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారని భావించిన పోలీసు అధికారులు.. ఊటీ కొండలు సహా తమిళనాడులోని పలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు.

కేరళలోని మనంతవాడి ప్రాంతంలో ప్రమోద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లోకి ఓ మహిళ సహా నలుగురు మావోయిస్టులు దూసుకెళ్లి, చంపుతామని బెదిరించారని పోలీసువర్గాలు అంటున్నాయి. అతడి మోటారు సైకిల్ను మావోయిస్టులు తగలబెట్టారు. దీంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం అటవీశాఖాధికారులతో కలిసి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల వేట ముమ్మరంగా సాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement