అత్యాచారాన్ని ప్రతిఘటించిందని... | Sakshi
Sakshi News home page

అత్యాచారాన్ని ప్రతిఘటించిందని...

Published Tue, May 12 2015 10:33 AM

Chhattisgarh: Man burns children to death after woman resists rape

రాయపూర్:  ఛత్తీస్గడ్ దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారాన్ని ప్రతిఘటించిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదంగా ప్రవర్తించాడు. ఆమె బంధువుల  పిల్లల్ని కిరోసిన పోసి నిప్పు అంటించిన ఘటన స్థానికంగా  విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం  ప్రకారం గుసిద్ధి గ్రామంలో మహావీర్ అనే దుండుగుడు  22సంత్సరాల వివాహిత మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.   అయితే తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె అతడి నుంచి తప్పించుకుంది. దీంతో  రెచ్చిపోయిన ఆ దుండగుడు ఆ మహిళ మేనకోడలు భువనేశ్వరి  (6) మేనల్లుడు  మోహన్ (3) ను  కిరోసిన్ పోసి నిప్పంటించడంతో  ఆ పసివాళ్లు  మంటల్లో కాలి బూడిదైపోయారు.   దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.   

గత నెలలోనే బాధితురాలు అత్తవారింటికి వచ్చిందని,   మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన మహావీర్.. అత్యాచారానికి యత్నించి విఫలం కావడంతో  ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసు అధికారి  తెలిపారు.  నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  తెలిపారు.

Advertisement
Advertisement