జపాన్ ప్రధానికి షెహనాయ్ స్వాగతం | Bismillah Khan's son to perform to welcome Abe in Varanasi | Sakshi
Sakshi News home page

జపాన్ ప్రధానికి షెహనాయ్ స్వాగతం

Dec 12 2015 3:37 PM | Updated on Sep 3 2017 1:53 PM

ప్రముఖ షెహనాయ్ విధ్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కుమారుడు జపాన్ ప్రధాని షింజో అబేకు స్వాగతం పలకనున్నారు.

వారణాసి: ప్రముఖ షెహనాయ్ విధ్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కుమారుడు జపాన్ ప్రధాని షింజో అబేకు స్వాగతం పలకనున్నారు. శనివారం సాయంత్రం అబే వారణాసి సందర్శించనున్న నేపధ్యంలో నాదేశ్వర్ లోని హోటల్ తాజ్ గేట్ వేలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో షెహనాయ్ కచేరి ఉంది.

దీనిద్వారా ఒకప్పటి షెహనాయ్ లెజండరీ, భారత రత్న అవార్డు గ్రహీత బిస్మిల్లా ఖాన్ కుమారుడు జమీన్ ఉస్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో అబేకు స్వాగతం కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీంతోపాటు గంగా నది ఒడ్డున అబేకు గంగా హారతి కార్యక్రమంతో కూడా అబే పాల్గొంటారు. అబే అక్కడికి వస్తున్న నేపథ్యంలో వారణాసి మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement