భయ్యూ వెయ్యి కోట్ల ఆస్తి వినాయక్‌కు

Bhaiyyu Maharaj Aide Gets Charge Of 1,000 Crore Property - Sakshi

ఇండోర్‌ : మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్‌కు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య రోజు ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఇండోర్‌ డీఐజీ హరి నారాయణచారి మిశ్రా తెలిపారు. ఆ ఆస్తులకు సర్వహక్కులు భయ్యూ నమ్మిన బంటు వినాయక్‌కు చెందాలని తన సూసైడ్‌​ నోట్‌లో రాసుకున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం భయ్యూ మహారాజ్‌ పేరున ఉన్న ఆస్తులు ఇకపై వినాయక్‌కు చెందుతాయని మిశ్రా స్పష్టం చేశారు.

వినాయక్‌ గత పదిహేనేళ్లుగా భయ్యూ మహారాజ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన చేసే ప్రతిపనిలో వినాయక్‌ పాలుపంచుకున్నారు. ఈ కారణంగానే యావదాస్తిని వినాయక్‌కు చెందేలా సూసైట్‌ నోట్‌ రాశారని భావిస్తున్నారు. ఈ ఆస్తులపై భయ్యూ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు ఉండవని డీఐజీ తెలిపారు. చట్టబద్ధంగా 1000 కోట్ల ఆస్తి ఉన్న భయ్యూకు లెక్కల్లో లేని ఇతర ఆస్తులు ఇంకా చాలా ఉండి ఉంటాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అయితే ఈ సూసైడ్‌ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తిని కాజేయండంలో భాగంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇది చదవండి : అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు ,   ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top