సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది | bank employees call strike on february 28 | Sakshi
Sakshi News home page

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది

Jan 31 2017 7:29 PM | Updated on Oct 1 2018 5:24 PM

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది - Sakshi

సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది

బ్యాంకు ఉద్యోగులు మరోమారు సమ్మెకు దిగుతున్నారు.

చెన్నై: ఎగవేత దారుల నుంచి రుణాల వసూలు, ఐచ్చిక బకాయిదారులపై చర్యలు.. తదితర డిమాండ్లతో బ్యాంకు సిబ్బంది ఫిబ్రవరి 28వ తేదీన సమ్మెకు దిగనున్నారు. ముందుగా మూడు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, అయితే మొత్తం 9 యూనియన్లు కూడా ఆందోళనలో పాలుపంచుకోనున్నాయని ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 28వ తేదీన తలపెట్టిన సమ్మెలో దేశవ్యాప్తంగా పది లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement