పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు | At 12, Jaipur prodigy clears higher secondary exam | Sakshi
Sakshi News home page

పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు

May 16 2016 9:47 PM | Updated on Sep 4 2017 12:14 AM

పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు

పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు

రాజస్థాన్లో ఓ పన్నేండేళ్ల పిల్లాడు రికార్డు సృష్టించాడు. పన్నేండేళ్లకే పన్నెండో తరగతి పాసయ్యాడు.

రాజస్థాన్: రాజస్థాన్లో ఓ పన్నేండేళ్ల పిల్లాడు రికార్డు సృష్టించాడు. పన్నేండేళ్లకే పన్నెండో తరగతి పాసయ్యాడు. సోమవారం సాయంత్రం రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆర్బీఎస్ఈ) విడుదల చేసిన ఫలితాల్లో ఈ రికార్డు వెల్లడయింది.

అబ్బాస్ శర్మ అనే పిల్లాడి వయసు 12 ఏళ్లు. ఇతడు ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తండ్రి సచిన్ శర్మ 2004లోనే స్కూల్ లో పేరు నమోదు చేశాడు. గతంలో పదేళ్లకే పదో తరగతి పాసై రికార్డు సృష్టించి చర్చల్లో నిలిచాడు. తాజాగా మరోసారి పన్నెండో తరగతిలో 600 మార్కులకు 325 మార్కులు తెచ్చుకొని దిగ్విజయంగా ఢిగ్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement