ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(72) ప్రతిష్టాత్మక పౌరపురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్లోని దర్బార్హాల్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. తెలుగు తేజాలైన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, తెలుగుసినీ నటుడు కోటా శ్రీనివాసరావులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అమితాబ్తోపాటు న్యాయ కోవిదుడు కె.కె.వేణుగోపాల్, కర్ణాటకలోని శ్రీమంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి డి.వీరేంద్ర హెగ్డే, అణుశాస్త్రవేత్త ఎం.రామస్వామి శ్రీనివాసన్, ప్రముఖ వ్యాపారవేత్త కరీం అగా ఖాన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు.
అమితాబ్ భార్య జయా బచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, కూతురు శ్వేతానంద, ఆమె కొడుకు అగస్త్య, కూతురు నవ్య నవేలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు ప్రముఖ సినీనటుడు దిలీప్ కుమార్(92) రాలేకపోయారు. ఇక పద్మ భూషణ్ అందుకున్న వారిలో సినీ ప్రముఖులు జాను బారువా, గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, కంప్యూటర్ సైంటిస్ట్ విజయ్ భట్కార్, ఆధ్యాత్మిక గురువు స్వామి సత్యమిత్రానంద్ గిరి, పండిట్ గోకులోత్సవ్ జి మహరాజ్, రాజ్యాంగ నిపుణులు సుభాశ్ సి కశ్యప్, ప్రముఖ వైద్యులు అంబరీశ్ మిట్టల్ ఉన్నారు. కర్ణాటకలోని శ్రీసిద్ధగంగ మఠం అధినేత శివకుమార స్వామి(107) పద్మభూషణ్ అవార్డు అందుకునేందుకు రాలేకపోయారు.
అమితాబ్కు పద్మ విభూషణ్
Published Thu, Apr 9 2015 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement